వారికి ఏం కావాలో అది చేస్తేనే టీడీపీలో పదవులు.. దివ్యవాణి సంచలన కామెంట్స్..!

టీడీపీకి రాజీనామ చేసిన దివ్య వాణి.. ఆ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో ఆమె మాట్లాడుతూ పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై ఉద్వేగానికి లోనై.. కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదన్నారు. తనపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తాను ఎవరికీ భజన చేయనని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబును కొందరూ రాంగ్ రూట్‌లోకి తీసుకెళ్తున్నారన్నారు. 

కొందరు జర్నలిజం పేరుతో నానా మాటలు అన్నారని.. కొందరు మహిళా నేతలు తనకు ఫోన్‌ చేసి తిట్టారని దివ్యవాణి చెప్పారు. టీడీపీలో ప్రెస్‌మీట్ పెట్టాలంటే మాముళ్లు ఇవ్వాలి..అలా మాముళ్లు ఇవ్వడం తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లో వచ్చానని దివ్య వాణి స్పష్టం చేశారు.

 టీడీపీ ఆఫీస్‌ బాయ్ తనను ఆపడం ఏంటని ప్రశ్నించారు. టీడీ జనార్ధన్‌ అనే వ్యక్తిని ప్రశ్నిస్తే నరకం చూపిస్తారా అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. మహానాడులో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతానని అయ్యన్నపాత్రుడుతోపాటు ఇతరులకు చెప్పినా ప్రయోజనం లేదన్నారు. టీడీపీలో పొమ్మనలేక పొగబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 

పదవుల కోసం తాను ఎప్పుడు పాకులాడలేదని స్పష్టం చేశారు. మహానాడులో తనను మాట్లాడించకుండా అవమానించారన్నారు. చంద్రబాబు పర్సనల్ పీఏ రాజగోపాల్‌కు నార్కో టెస్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీలో బాలకృష్ణ కంటే తానే ఎక్కువగా పనిచేశానని దివ్య వాణి అన్నారు. ఆయన ఏనాడైనా అమరావతికి వచ్చారా అంటూ ప్రశ్నించారు. మహానాడులో ఎన్టీఆర్ కు భారతరత్న కోసం తీర్మానం చేయలేదన్నారు. 

పార్టీ తనకు జరిగిన అవమానాలన్నీ చంద్రబాబుకు వివరించారన్నారు. తన భవిష్యత్‌ను కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రజా సేవ కోసమే తాను ఉన్నానని తెలిపారు. తాను ఏ పార్టీలో చేరుతానో ఇప్పుడే చెప్పలేనన్నారు. టీడీపీలో అడవాళ్లంతా ఏడుస్తున్నారని, టీడీపీలో ఆడవాళ్లకు అవకాశాలు రావాలంటే నలుగురు చుట్టూ తిరగాలని, వారికి ఏం కావాలంటే అది చేస్తేనే పదువులు ఇస్తారని దివ్యవాణి ఆరోపించారు.  

 

 

Leave a Comment