పోలీస్ తండ్రీకూతుళ్లను అభినందించిన డీజీపీ సవాంగ్..!

తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో ఈ పోలీస్ తండ్రీకూతుళ్లు శ్యామ్ సుందర్, జెస్సీ ప్రశాంతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డీఎస్సీ హోదాలో ఉన్న తన కూతురు జెస్సీకి సీఐ ర్యాంకులో ఉన్న తండ్రి శ్యామ్ సుందర్ సెల్యూట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. 

ఈనేపథ్యంలో ఈ తండ్రీకూతుళ్లతో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. వారి గురించి వివరాలు తెలుసుకుని వారిని అభినందించారు. ఇక కుమార్తెను పోలీస్ అధికారిణిగా మలిచిన సీఐ శ్యామ్ సుందర్ ను ప్రశంసించారు. వృత్తిలో మరింత రాణించాలని సూచించారు. 

 

Leave a Comment