అనాధ శవాన్ని పంట పొలాల్లో 2 కిలోమీటర్లు తన భూజాలపై మోసిన కాశీబుగ్గ ఎస్సై శిరీషను ఏపీ డీజీపీ అభినందించారు. అమరావతిలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు డీజీపీ డిస్క్ అవార్డును డీజీపీ అందజేశారు. అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించారు.మానవత్వంతో వ్యవహరించిన ఆమె ఇతర పోలీసులకు ఆదర్శమని, ఇది తమ వృత్తిలో భాగమే అయినా శిరీష చేసిన పనిని మెచ్చుకోవాల్సిందేనని డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు.
డీజీపీ డిస్క్ అవార్డు రావడం పట్ల సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఎస్సై శిరీష అన్నారు. సమాజంలో ఒక ఆడపిల్లగా శవాన్ని మోయడం అందరూ వ్యతిరేకిస్తారని, తాను అంబులెన్స్ వరకూ ఆ శవాన్ని మోసానని తెలిపారు. తన తల్లిదండ్రులు తనకు నేర్పిన సేవాభావం ఈరోజు తనకు అవార్డు తెచ్చిపెట్టిందని చెప్పారు. అవార్డు అందించిన డీజీపీకి అభినందనలు తెలిపారు.
Woman #khaki, a symbol of humanity: #DGP Gautam Sawang presented the DGP’s Commendation Disc Award and a Certificate of Appreciation to WSI K. #Sirisha of Kasibugga PS for her exemplary service, professional excellence, display of #humanity & devotion to her duty. (1/2) pic.twitter.com/AFOCsz8etS
— Andhra Pradesh Police (@APPOLICE100) February 5, 2021