కన్న బిడ్డను చూసేందుకు ఆ తల్లికి మూడు నెలలు పట్టింది..!

ప్రపంచంలో ఏ తల్లికైనా అప్పుడే పుట్టిన బిడ్డను తన చేతుల్లో తీసుకోవడం ఒక మధురానుభూతి.. కానీ నవమాసాలు మోసి కనిన బిడ్డను చూసేందుకు ఆ తల్లికి మూడు నెలలు పట్టింది. ఆ మూడు నెలలు ఆ తల్లి మృత్యువుతో పోరాడింది. యూఎస్ లోని విస్కాన్సిన్ కు చెందిన కెల్సే అనే మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు కరోనా వైరస్ సోకింది. 

నవంబర్ 4న ఆమె పండంటి బిడ్డ పుట్టింది. అది ఆమెకు ఐదో సంతానం.. కాగా సిజీరియన్ చేసే సమయంలో అనారోగ్య కారణాలతో ఆమె కోమాలోకి వెళ్లింది. దాదాపు మూడు నెలల తర్వాత జనవరి 27న ఆమె కోమా నుంచి బయటకు వచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన తర్వాత తన బిడ్డను చూసి కన్నీటిపర్యంతమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

Leave a Comment