కాశీ గర్భగుడిలో కొట్టుకున్న భక్తులు, సిబ్బంది.. వీడియో వైరల్..!

వారణాసిలోని పవిత్రమైన కాశీవిశ్వనాథ ఆలయ గర్భగుడిలో వాగ్వాదం జరిగింది. దర్శనం విషయంలో భక్తులు, ఆలయ సిబ్బంది దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ వీడియోలో భక్తులు, ఆలయ సిబ్బంది ఒకరినొకరు తోసుకుంటూ కనిపించారు. 

వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం గర్భగుడిలో శివుడికి హారతి ఇస్తున్నారు. ఈ క్రమంలో తలుపులు మూసివేస్తుండగా ఇద్దరు భక్తులు దర్శనం చేసుకుంటామని పట్టుబట్టారు. అయితే వారిని ఆలయ సిబ్బంది అడ్డుకుంది. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. సిబ్బంది ఎంత చెబుతున్నా వినిపించుకోలేదు. వారితో దురుసుగా ప్రవర్తించారు. 

ఈ నేపథ్యంలో మాటా మాటా పెరిగి ఆలయ సిబ్బంది, ఇద్దరు భక్తులు గర్భగుడిలోనే ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అయితే, ఈ ఘటన జరిగిన అనంతరం.. ఆలయ సిబ్బంది నిర్వాహకులకు లేఖ రాశారు. ఈ లేఖలో తమకు పోలీసులు సహకరించలేదని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే కాశీలో దర్శనం విషయంలో పోలీసులు, ఆలయ సిబ్బందికి మధ్య గొడవ జరిగిన ఘటన మరువక ముందే తాజాగా ఇలా జరిగింది. 

 

 

Leave a Comment