వారణాసిలోని పవిత్రమైన కాశీవిశ్వనాథ ఆలయ గర్భగుడిలో వాగ్వాదం జరిగింది. దర్శనం విషయంలో భక్తులు, ఆలయ సిబ్బంది దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ వీడియోలో భక్తులు, ఆలయ సిబ్బంది ఒకరినొకరు తోసుకుంటూ కనిపించారు.
వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం గర్భగుడిలో శివుడికి హారతి ఇస్తున్నారు. ఈ క్రమంలో తలుపులు మూసివేస్తుండగా ఇద్దరు భక్తులు దర్శనం చేసుకుంటామని పట్టుబట్టారు. అయితే వారిని ఆలయ సిబ్బంది అడ్డుకుంది. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. సిబ్బంది ఎంత చెబుతున్నా వినిపించుకోలేదు. వారితో దురుసుగా ప్రవర్తించారు.
ఈ నేపథ్యంలో మాటా మాటా పెరిగి ఆలయ సిబ్బంది, ఇద్దరు భక్తులు గర్భగుడిలోనే ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అయితే, ఈ ఘటన జరిగిన అనంతరం.. ఆలయ సిబ్బంది నిర్వాహకులకు లేఖ రాశారు. ఈ లేఖలో తమకు పోలీసులు సహకరించలేదని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే కాశీలో దర్శనం విషయంలో పోలీసులు, ఆలయ సిబ్బందికి మధ్య గొడవ జరిగిన ఘటన మరువక ముందే తాజాగా ఇలా జరిగింది.
Devotees, temple staff fight over darshan at Kashi Vishwanath templepic.twitter.com/AgLLBmNPiZ
— Priyathosh Agnihamsa (@priyathosh6447) July 24, 2022