రోడ్డుపై రూ.45 లక్షలు దొరికితే.. నిజాయితీగా ఇచ్చేసిన కానిస్టేబుల్..!

ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన నిజాయితీని చాటుకున్నాడు. రోడ్డుపై దొరికిన రూ.45 లక్షలను తిరిగి ఇచ్చేశాడు.. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లోని నవా రాయ్ పూర్ కయబంధా పోస్ట్ లో నిలాంబర్ సిన్హా ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. 

మనా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున రోడ్డుపై ఓ బ్యాగును చూశాడు.. ఆ బ్యాగ్ ని తెరిచి చూస్తే.. నోట్ల కట్టలు బయటపడ్డాయి. బ్యాగులో రూ.2 వేలు, రూ.500 నోట్ల కట్టలు ఉన్నాయి. అవి సుమారు రూ.45 లక్షలు ఉంటాయి. 

వెంటనే మరో ఆలోచన చేయకుండా డబ్బులతో ఉన్న బ్యాగును స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పాడు. నోట్ల కట్టలతో దొరికిన బ్యాగును తిరిగి ఇచ్చేసి తన నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలాంబర్ ని ఉన్నతాధికారులు అభినందించారు. అతడికి రివార్డు ప్రకటించారు. అయిగే బ్యాగు ఎవరిదన్న విషయం తెలియరాలేదు.. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Comment