చనిపోయిన వ్యక్తి బతికాడు.. 7 గంటలు మార్చురీ ఫ్రీజర్ లో ఉన్నా..!

కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.. చనిపోయిన వ్యక్తి బతకడం వంటి సీన్లు సినిమాల్లో చూస్తుంటాం.. కానీ అలాంటి ఘటన నిజంగానే జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని మోరదాబాద్ లో చనిపోయాడనుకున్న వ్యక్తి బతికాడు. 7 గంటల పాటు మార్చురీలో ఉంచినప్పటికీ బతికి అందరినీ షాక్ కి గురిచేశాడు.. 

వివరాల మేరకు శ్రీకేష్ కుమార్(40) అనే వ్యక్తి పౌరసఫరాల సంస్థలో ఎక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి శ్రీకేష్ కి బైక్ యాక్సిడెంట్ అయింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో పరీక్షలు చేసిన వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు. 

శ్రీకేష్ బాడీని మార్చురీలో ఫ్రీజర్ లో ఉంచారు. ఇంకా పోస్ట్ మార్టం జరగలేదు.. పంచనామ పూర్తి చేసి బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పోలీసులు వచ్చారు. ఆ సమయంలో శ్రీకేష్ బాడీలో కదలికలను అతని వదిన గుర్తించింది. వెంటనే వైద్యులకు తెలిపగా.. వెంటనే చికిత్స అందించారు. దీంతో శ్రీకేష్ కుమార్ బతికి బయటపడ్డాడు.. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

  

 

Leave a Comment