మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. 

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ఐకాస ఆధ్వర్యంలో సుమారు రెండేళ్లుగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులతో సహా పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. రాజధాని కేసులపై హైకోర్టు తాజాగా రోజువారీ విచారణ చేపట్టింది. ఈనేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకుంది.. 

Leave a Comment