‘కశ్మీర్ ఫైల్స్’కి వ్యతిరేకంగా పోస్ట్.. దళితుడి ముక్క నేలకు రాయించి..!

హిందూ దేవుళ్లను విమర్శించాడని ఓ దళితుడి ముక్క నేలకు రాయించారు. ఈ ఘటన రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రాజేష్ కుమార్ మేఘ్వాల్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. రెండు మూడు రోజుల క్రితం ఫేస్ బుక్ లో ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ చేశాడు.. 

పండిట్లపైనే అఘాయిత్యాలు జరిగాయా.. దళితులపై కాదా అని మేఘ్వాల్ పేస్ బుక్ పోస్ట్ లో ప్రశ్నించాడు. పేదలపై రోజూ అఘాయిత్యాలు జరుగుతున్నాయని, వారి భద్రత కోసం ఏం చేయడం లేదాని రాసుకొచ్చాడు. మేఘ్వాల్ పోస్టుకు ప్రతిస్పందనగా కొందరు వ్యక్తులు శ్రీరామ్, జై శ్రీకృష్ణ అని కామెంట్స్ చేశారు. 

అయితే ఈ కామెంట్స్ కి స్పందనగా మేఘ్వాల్ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత మేఘ్వాల్ క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే కొంత మంది స్థానికులు అతడ్ని ఆలయంలో క్షమాపణలు చెప్పాలని బలవంతం చేశారు. ఒక ఆలయానికి తీసుకెళ్లి.. ఆలయంలో ముక్కుతో రుద్దమని కొంతమంది బలవంతం చేశారు. దీంతో అతడు వారు చెప్పినట్లు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు..   

 

Leave a Comment