‘ఇన్ని డ్రామాలు చేయాలా నాయనా’.. మురికి కాల్వ శుభ్రం చేసి.. పాలతో స్నానం చేసిన నేత..!

దర్శకుడు శంకర్ తీసిన ఒకేఒక్కడు సినిమా గుర్తుండే ఉంటుంది.. అందులో ఓ సీన్ లో అర్జున్ కి బురద అంటుకోవడంతో అక్కడి జనాలు పాలతో స్నానం చేయిస్తారు.. అచ్చం అలాంటి ఘటన ఢిల్లీలో జరిగింది. తూర్పు ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ ఓ విచిత్రమైన పనిచేశాడు.. మురికి కాల్వను శుభ్రం చేయడానికి.. కాల్వలో దూకాడు. ఆ తర్వాత అక్కడి కార్యకర్తలు అతడిని పాలతో స్నానం చేయిస్తారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. 

ఆప్ పార్టీకి చెందిన కౌన్సిలర్ హసీబ్ ఉల్ హసన్ శాస్త్రీ పార్క్ ప్రాంతంలో పర్యటనకు వచ్చారు. అక్కడ డ్రెయిన్ మూసుకుపోయి దుర్వాసన రావడాన్ని గమనించాడు. సాధారణంగా మున్సిపల్ సిబ్బందిని పిలిచి.. వారితో డ్రెయిన్ శుభ్రం చేయిస్తారు. కానీ ఈ నాయకుడికి వారిని పిలిచేంత సమయం లేదనిపించిందేమో..

నడుముకు తాడు కట్టుకుని డ్రెయిన్ లో దూకారు. స్వయంగా డ్రెయిన్ ను శుభ్రం చేశాడు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. డ్రెయిన్ ను శుభ్రం చేసి బయటకు వచ్చే సరికి ఆయన మురికిలో తడిసిపోయి కనిపంచారు. ఆ తర్వాత ఒకేఒక్కడులో అర్జున్ తరహాలో పాలతో స్నానం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

Leave a Comment