ఏపీలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు..!

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ సడలింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించింది. కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో సడలింపు ఉంటుంది. 

పాజిటివిటీ 5 శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాలో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలించారు.  రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరాత్రా మూసివేత కొనసాగుతుంది. అనంతపురం, కర్నూలు, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, కడప, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆంక్షల సడలింపు ఉంటుంది. 

కోవిడ్ పాజిటివిటీ 5 శాతం కన్నా ఎక్కువ ఉన్న ఉభయ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సడలింపు ఉంటుంది. జులై 1 నుంచి జులై 7 వరకు ఈ తాజా సడలింపు నిర్ణయాలు వర్తిస్తాయి. 

 

Leave a Comment