పాక్ పై భారత్ ఓటమి.. గుండెపోటుతో అభిమాని మృతి..!

ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎంత హైప్ ఉంటుందో అందరికీ తెలిసిందే.. క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఉత్కంఠతో మ్యాచ్ చూస్తారు. ఈ రెండు జట్లలో ఏ టీమ్ ఓడిపోయినా వారి అభిమానులు జీర్ణయించుకోలేకపోతారు. ఇక కొందరైతే తీవ్ర ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా పాకిస్తాన్ పై ఇండియా ఓటమి చెందడంతో ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని సోమవారపేట తాలుకా దొడ్డబళె గ్రామానికి చెందిన ఉదయ్(50)కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆదివారం రాత్రి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తిలకిస్తూ టీమిండియా ఓటమి అంచున ఉండటంతో ఉదయ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దీంతో ఉదయ్ కి గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. 

కాగా.. ఆదివారం జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్ల నష్టానికి ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. అనంతరం 152 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన పాకిస్తాన్ వికెట్ ఏమీ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్ చరిత్రను తిరగరాసింది. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ లలో పాకిస్తాన భారత్ పై గెలవడం ఇది తొలిసారి..  

Leave a Comment