నగ్నంగా వీడియో కాల్స్ చేసి.. రూ.22 కోట్లు సంపాదించారు..!

ప్రస్తుతం చాలా మంది ఈజీ మనీ సంపాదించేందుకు దేనికైనా సిద్ధపడుతున్నారు. సోషల్ మీడియా సాయంతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ దాదాపు 200 మందిని మోసం చేశారు ఓ భార్యాభర్తలు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాలు మేరకు.. ఘజియాబాద్ సప్పాగౌతమ్, యోగేశ్ భార్యాభర్తలు.. ఈ దంపతులు ఈజీగా డబ్బులు సంపాదించాలని భావించారు. దీంతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ రికార్డ్ చేసి బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించారు..

అలా భర్త యోగేశ్ వ్యక్తుల వివరాలను సేకరించేవాడు. సప్నా కొంత మంది యువతలకు వీడియో కాల్ ఎలా మాట్లాడాలో శిక్షణ ఇచ్చింది. ముందుగా వీరు ఓ వెబ్ సైట్ తో టైఅప్ అయ్యారు. ఆ వైబె సైట్ నుంచి నగ్నంగా వీడియో కాల్ మాట్లాడేవారు. నిమిషానికి రూ.200పైగా వసూలు చేసేవారు. అది కూడా ముందుగానే చెల్లించాలని చెప్పేవారు. వచ్చిన డబ్బులలో సగం వెబ్ సైట్ కి పోతే.. మిగిలిన సగం వీరు తీసుకుంటారు. 

తర్వాత వీరికి ఇంకో ఐడియా వచ్చింది. స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడితే మొత్తం డబ్బులు తీసుకోచ్చని భావించారు. అందుకు ఆ వెబ్ సైట్ కి ఇచ్చే రేటు కంటే తక్కవకు వీడియో కాల్ చేస్తామని బాధితుల నుంచి ఫోన్ నంబర్లు సేకరించేవారు. వారితో వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ద్వారా వీడియో కాల్స్ చేసేవారు. అవతలి వ్యక్తి నగ్నంగా మాట్లాడేలా చేసి దానిని రికార్డు చేస్తారు. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసేవారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు బయటపెడతామని బెదిరించేవారు. 

అలా గత రెండేళ్ల నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.22 కోట్లను దోచుకున్నారు. యువతులతో నగ్నంగా వీడియో కాల్స్ చేయించి వారికి నెలకు రూ.25 వేలు జీతం చెల్లించేవారు. మెసేజ్ లు చేసేవారికి రూ.15 వేలు ఇచ్చేవారు. ఓ కంపెనీ ఉద్యోగి సదరు కంపెనీ ఖాతా నుంచి రూ.80 లక్షలను వీరికి బదిలీ చేశాడు. దీంతో కంపెనీ యజమాని గుజరాత్ లోని రాజ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ కేసులు భార్యాభర్తలతో సహా, మరో ముగ్గురు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు.  

Leave a Comment