భారత్ లో కోవిడ్ ఎప్పటికీ అంతం కాదు: WHO

భారతదేశంలో కరోనాపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) సంచలన విషయాలు వెల్లడించింది. భారత్ లో కరోనా ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మరికొన్ని రోజులు కోవిడ్ ఇలానే ఉండే అవకాశం ఉందని తెలిపింది. పిల్లలకు కరోనా సోకినా వ్యాధి అతి స్వల్పంగానే ఉంటుందని స్పష్టం చేసింది. 

అంతేకాకుండా ఇటీవల కోవిడ్ ఎప్పటికీ అంతం కాదని, మనతోనే శాశ్వతంగా ఉంటుందని చాలామంది శాస్త్రవేత్తలు పేర్కొన్న విషయం తెలిసిందే.. సార్స్ కోవి-2ను అంతం చేయవచ్చా అని ప్రముఖ సైన్స్ జర్నల్ ‘నేచర్’ గత జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కు పైగా మ్యునాలజిస్టులను, వైరాలజిస్టులను, ఆరోగ్య నిపుణులను అడిగింది. నిర్మూలించడం సాధ్యం కాదని వారిలో 90 శాతానికి పైగా సమాధనం ఇచ్చారు. 

Leave a Comment