భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగే విషయంలో అనేక అపోహలు ఉంటాయి. వెంటనే తగవచ్చా? కొంచెం గ్యాప్ ఇచ్చి తాగాలా? ఇలాంటి అనుమానాలు ఉంటాయి. ఈ విషయంలో చాలా మంది రకరకాలుగా చెబుతుంటారు. భోజనానికి ముందు నీళ్లు తాగవద్దని కొందరు.. భోజంన చేసిన వెంటనే నీళ్లు తాగవద్దని మరికొందరు అంటుంటారు. అయితే నీళ్లు ఎప్పుడు తాగాలి అనే దాని గురించి ఆయుర్వేదం ఏం చెబుతుంది.. ఇప్పుడు తెలుసుకుందాం..
భోజనం తర్వాత నీళ్లు తాగితే ఏమవుతుంది?
- భోజనానికి ముందు లేదా భోజనం చేసే సమయంలో లేదా భోజనం అనంతరం నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.
- జీర్ణ రసాలు నీటితో కలిసిపోతాయి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఎక్కువ భాగం బయటకు వస్తుంది.
- శరీరం మనం తినే ఆహారంలో పోషకాలను గ్రహించలేదు. దీంతో పాటు జీర్ణం కాకుండా మిగిలిపోయే పదార్థాలు కొన్ని కొవ్వు కింద మారుతాయి. దీని వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ కు దారి తీస్తుంది. అందువల్ల భోజనానికి ముందుగానీ, భోజనం చేసేటప్పుడు గానీ. భోజనం తర్వాత గానీ వెంటనే నీళ్లు తాగరాదు.
నీళ్లు ఎప్పుడు తాగాలి?
- ఆధునిక వైద్యం అయితే భోజనానికి 30 నిమిషాల ముందు నీటిని తాగాలని, భోజనం అనంతరం 30 నిమిషాల తర్వాత నీటిని తాగాలని సూచిస్తోంది.
- అదే ఆయుర్వేదంలో అయితే ఆ వ్యవధిని 40 నిమిషాలుగా చెబుతున్నారు. భోజనానికి 40 నిమిషాల ముందు, భోజనం అనంతరం 40 నిమిషాల తర్వాత నీళ్లు తాగాలి. భోజనం చేశాక మళ్లీ నీటిని తాగేందుకు మళ్లీ నీళ్లు తాగేందుకు 40 నిమిషాలు ఆగాలి. ఈ విధంగా నీటిని తాగాల్సి ఉంటుంది.
- అయితే భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగాల్సి వస్తే కొద్ది కొద్దిగా చప్పరించినట్లు కొద్దిగా నీటిని తాగాలి. కానీ ఎక్కువ మొత్తంలో తాగరాదు. ఈ విధంగా నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు..