వచ్చే ఏడాదికి కరోనా అంతం : బిల్ గేట్స్

కరోనా వైరస్ కు సంబంధించి మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, బిలియనీర్ బిల్ గేట్స్ ప్రపంచానికి ఒక శుభవార్తను అందించారు. కరోనా వైరస్ వచ్చే ఏడాది నాటికి చాలా దేశాల్లో అంతమవుతుందని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ త్వరలోనే వస్తుందని, 2022 నాటికి ప్రపంచం కోవిడ్-19 ముగిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

కరోనా వల్ల కలిగిన ఆర్థిక వినాశనం నుంచి కోలుకోవడం కష్టం అన్నారు. అయితే ఈ కాలంలో వైద్యరంగంలో అనేక ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయని, నూతన చికిత్స విధానాలు, వ్యాక్సిన్ పరిశోధనల్లో పురుగతి జరిగిందని అమెకన్ మ్యాగజైన్ వైర్డ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ చెప్పారు. 2021 చివరి నాటికి కొన్ని దేశాల్లో వైరస్ అంతం అవుతుందని, 2022 చివరి నాటికి ప్రపంచం వైరస్ యొక్క ముగింపును చూస్తుందని వెల్లడించారు. 

Leave a Comment