పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా..క్వారంటైన్ లో 72 కుటుంబాలు..

ఢిల్లీలో ఓ పిజ్జా డెలివరీ ఏజెంట్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీని వల్ల 72 కుటుంబాలను క్వారంటైన్ చేశారు. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలో ఉన్నారు. 19 ఏళ్ల ఈ పిజ్జా డెలివరీ బాయ్ గత ఆదివారం వరకు దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ లోని రెస్టారెంట్ కోసం పిజ్జాలు పంపిణీ చేశాడు. 

అతడు గత 15 రోజుల్లో హౌజ్ ఖాస్, మాల్వియా నగర్ మరియు సావిత్ర నగర్ వంటి ప్రాంతాల్లో 72 కుటుంబాలకు పిజ్జా పంపిణీ చేశాడు. ఈ కుటుంబాలు ఇంటి నిర్బంధంలో ఉన్నాయని, వారిని పర్యవేక్షిస్తున్నామని దక్షిణ ఢిల్లీ కలెక్టర్ తెలిపారు. 

ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల్లో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీలో ఇప్పటి వరకు 1,578 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 32 మంది మరణించారు. అలాగే 42 మంది రికవరీ అయ్యారు. కాగా దేశ వ్యాప్తంగా 12,380 కరోనా కేసులు నమోదు కాగా, 414 మంది మరణించాడు. 

Leave a Comment