ఆ 10 రాష్ట్రాల్లో కరోనా కట్టడి చేస్తే భారత్ గెలిచినట్లే : మోడీ

కరోనా కట్టడిలో ఆ 10 రాష్ట్రాలు విజయం సాధిస్తే..భారతదేశం కరోనా వైరస్ పై విజయం సాధిస్తుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ ప్రభావిత 10 రాష్ట్రా ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వర్చువల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్, యూపీ, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా కేసులు 80 శాతానికి పైగా ఉన్నాయని తెలిపారు. 

ఈ సమావేశంలో ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ ‘ మనం 10 రాష్ట్రాల్లో కరోనా వైరస్ ను ఓడిస్తే..దేశం కూడా గెలుస్తుంది. ఇప్పుడు ఒక కొత్త మంత్రాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. కరోనా సోకిన వ్యక్తితో పరిచయం ఉన్న వారందరినీ 72 గంటలలోపు గుర్తించి పరీక్షించాలి. అప్పుడు కరోనాను చాలా వరకు కట్టడి చేయవచ్చు.. అని ప్రధాని మోడీ సూచించారు. 

Leave a Comment