అయోధ్యలో ప్రధాని మోడీతో వేదిక పంచుకున్న రామ జన్మభూమి ట్రస్ట్ చైర్మన్ కు కరోనా పాజిటివ్..

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర చైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వేడుకకు కొన్ని రోజుల ముందు రామ్ జన్మభూమి కాంప్లెక్స్ పూజారి ప్రదీప్ దాస్ మరియు 14 మంది పోలీసులు కూడా కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.. ఇప్పుడు మహంత్  నృత్య గోపాల్ దాస్ కరోనా బారిన పడటం ఆందోళనను కలిగిస్తోంది. ఆగస్టు 5న అయోధ్యలో జరిగిన రామమందిరం నిర్మాణ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులతో ఆయన వేదిక పంచుకున్నారు. ప్రముఖులలో ప్రధాని మోడీతో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మరియు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు. 

 మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆరోగ్యంపై యూపీ సీఎం యోగీ ఆరాతీశారు. వైద్యులతో మాట్లాడి  మహంత్ నృత్య గోపాల్ దాస్ కు తక్షణ వైద్యం అందించాలని సూచించారు. సాధ్యమైనంతగా మెరుగైన వైద్య సహాయం అందించడానికి అన్ని విధాలా ప్రయత్నించాలని ఆదేశించారు. 

 

 

Leave a Comment