మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్టుు చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసిన వారందరిని టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియజేస్తాను.’ అంటూ చిరు పోస్ట్ చేశారు.

కారోనా కారణంగా వాయిదా పడ్డ ‘ఆచార్య’ షూటింగ్ ఈ రోజు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో ఆగిపోయింది. కాగా మూడు రోజుల క్రితం చిరంజీవి, నాగార్జున కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి వరద సాయం అందించారు. కొద్ది రోజుల క్రితం చిరంజీవి సోదరుడు నాగబాబుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే.. 

Leave a Comment