గోకుల్ చాట్ లో కరోనా కలకలం..

హైదరాబాద్ లోని గోకుల్ చాట్ లో కరోనా కలకలం సృష్టించింది. గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు గోకుల్ చాట్ ను మూసివేశారు. అక్కడి 20 మంది సిబ్బందిని కూడా క్వారంటైన్ కు తరలించారు. 

హైదారాబాద్ లో గోకుల్ చాట్ గురించి తెలియని వారు ఉండరు. ఎప్పుడు జనాలో రద్దీగా ఉంటుంది. అక్కడ వేలాది మంది చాట్ తింటారు. ఈ సమయంలో అక్కడ కరోనా కలకలం రేపింది. దీంతో ఇటీవల అక్కడ చాట్ తిన్నవారు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు మాత్రం గోకుల్ చాట్ లో రెండు రోజులుగా ఎంత మంది చాట్ తిన్నారో వెతికే పనిలో ఉన్నారు. 

 

Leave a Comment