ఏపీలో పంజా విసురుతున్న కరోనా

ఏపీలో కరోనా పంజా విసురుతోంది. గత 24 గంటల్లో 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెరిగిన కేసులతో కలిపి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 813కు చేరింది. ఇప్పటికీ 24 మంది మరణించారు. అయితే కరోనా నుంచి 120 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 669 మంది ఉన్నారు. అత్యధికంగా కర్నూలులో 203 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ రిపోర్ట్..

అనంతపురం – 36

చిత్తూరు – 59

తూర్పు గోదావరి – 26

గుంటూరు – 177

కడప – 51

క్రిష్ణా – 86

కర్నూలు – 203   

నెల్లూరు – 67

ప్రకాశం – 48

శ్రీకాకుళం – 0

విశాఖపట్నం -21

విజయనగరం – 0

పశ్చిమ గోదావరి- 39

భారత్ లో 20 వేల కేసులు..

ప్రస్తుతం ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలకు చేరుకుంది. గత 24 గంటల్లోనే 1383 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికి 640 మంది మరణించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 5,218 కేసులు నమోదయ్యాయి. తర్వాత గుజరాత్ 2,178 కేసులు, ఢిల్లీ 2,156 కేసులు, తమిళనాడు 1,596 కేసులు నమోదు అయ్యాయి.  

 

Leave a Comment