రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ 420 కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో గుంటూరులో 7, నెల్లూరులో 4, కర్నూలులో 2, చిత్తూరు మరియు కడప జిల్లాల్లో ఒక్కొక్క కేసులు నమోదు కావడం జరిగింది. కొత్తగా నమోదైన 15 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 420కి పెరిగింది. రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరొక మరణం నిర్ధారించబడింది. దీంో రాష్ట్రంలో మరణాల సంఖ్య ఏడుకు చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 420 పాజిటివ్ కేసులకు గాను 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. అనంతపురంలో 2, క్రిష్ణలో 2, గుంటూరులో 2, కర్నూలులో 1 డిశ్చార్జ్ అయిన వారిలో ఉన్నారు.
జిల్లాల వారీగా కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య..
అనంతపురం – 15
చిత్తూరు – 21
తూర్పు గోదావరి – 17
గుంటూరు – 82
కడప – 31
క్రిష్ణ – 35
కర్నూలు -84
నెల్లూరు – 52
ప్రకాశం – 41
శ్రీకాకుళం – 0
విశాఖపట్నం – 20
విజయనగరం – 0
పశ్చిమ గోదావరి – 22