Indiaలో ఒకే రోజు 195 మరణాలు

India లో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భారత్ లో గడచిన 24 గంటల్లో 3,900 కొత్త కేసులు నమోదు కాగా, 195 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం 46,433 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. భారతదేశంలో మొత్తం మరణాలు 1,568కు చేరాయి. ఇప్పటి వరకు 12,727 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 14,541 కరోనా కేసులు నమోదు కాగా, 583 మంది మరణించారు. గుజరాత్ లో 5,804, ఢిల్లీలో 4,898, తమిళనాడులో 3,550, రాజస్థాన్ లో 3,061, మధ్య ప్రదేశ్ లో 2,942, ఉత్తర ప్రదేశ్ లో 2,776 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా 2,50,000 మంది మరణించారు. కేవలం ఒక్క అమెరికాలోనే 68,689 మంది చనిపోయారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 36,45,539 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

Leave a Comment