పతంజలి నుంచి కరోనా ఔషధం..

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. భారత దేశంలోనూ కరోనా పడగ విప్పుతోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కునుగొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పరిశోధనలు కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనేందుకు అహర్నిషలు పనిచేస్తున్నాయి. ఈ జాబితాలో పతంజలి సంస్థ కూడా వచ్చి చేరింది. 

కరోనా వైరస్ కి ఔషధం కనుగొనడానికి బాబా రామ్ దేవ్ ఆధ్వర్యంలోని పతంజలి సంస్థ కూడా రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి డ్రగ్ ట్రయల్స్ ప్రారంభించినట్లు సంస్థ ప్రతినిధి బాలక్రిష్ణ వెల్లడించారు. అవసరమైన రెగ్యులేటరీ ఆమోదం పొందిన తర్వాత కరోనా వైరస్ చికిత్స కోసం మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని తెలిపారు. తాము రెగ్యులేటరీ అనుమతి పొందిన తర్వాత ఇండోర్, జైపూర్ లలో కంపెనీ యూనిట్లలో క్లినికల్ ట్రయల్ ప్రారంభిస్తామని బాలక్రిష్ణ పేర్కొన్నారు. 

కరోనా వైరస్ చికిత్సకు వ్యాక్సిన్, ఔషధం కోసం ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మా కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నాయి. గిలీడ్ సైన్సెస్, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, ఇన్నోవియో ఫార్మా, గ్లాక్సో స్మిత్ క్లైన్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ పెద్ద కంపెనీల జాబితాలో పతంజలి పేరు చేరడం సంస్థకి పెద్ద విజయమే అని నిర్వాహకులు తెలిపారు. 

Leave a Comment