రెసిడెన్షియల్ స్కూల్ లో 32 మంది విద్యార్థులకు కరోనా..!

కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆయా రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. స్కూల్ లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించాయి. అయితే కర్ణాటకలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో 32 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. కొడుగు జిల్లా మడికెరిలోని జవహార్ నవోదయ విద్యాలయకు చెందిన 22 మంది బాలురు, 10 మంది బాలికలకు కరోనా సోకింది.

 స్కూల్ లో మొత్తం 270 మంది విద్యార్థులు చదువుతుండగా.. వారికి వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 32 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే 10 మంది విద్యార్థుల్లో లక్షనాలు కనిపించగా.. 22 మందికి ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ఇక పాఠశాల సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. కరోనా సోకిన వారంతా 9 నుంచి 12 వ తరగతికి చెందిన విద్యార్థులే ఉన్నారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్కూల్ ప్రిన్సిపల్ పంకజాషన్ పేర్కొన్నారు. అందరూ కోలుకుంటున్నారన్నారు. క్యాంపస్ మొత్తం శానిటైజ్ చేశామని, ఇతర ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

 

Leave a Comment