కరోనా ఎఫెక్ట్ ..ఆసీస్, కివీస్ వన్డే సిరీస్ రద్దు..

కరోనా ప్రభావంతో ఆసీస్, కివీస్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ రద్దయింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే ప్రేక్షకులు లేకుండానే జరిగింది. కరోనా వైరస్ దెబ్బకు మూసివేసిన స్టేడియంలోనే ఈ మ్యాచ్ ను క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించాల్సి వచ్చింది. ఇక ఈ వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 

కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా బోర్డు మిగిలిని మ్చాచ్ లను రద్దు చేసింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ను విడుదల చేసి నిర్వహిస్తామని తెలిపింది. ఇక ఆసీస్, కివీస్ జట్ల మధ్య మార్చి 24 నుంచి టీ20 సిరీస్ కూడా మొదలుకానుంద. దాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటిచింది. 

Leave a Comment