ఏపీలో 1177కు చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ జోరు కనబరుస్తోంది. ఏపీలో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1177కు చేరింది. గత 24 గంటల వరకు 6517 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా, 80 మందికి నిర్ధారణ అయింది. 

కర్నూలులో 13, గుంటూరు 23, కృష్ణా 33, కడప 3, ప్రకాశం 3, నెల్లూరు 7, శ్రీకాకుళం 1, వెస్ట్ గోదావరి 3, చొప్పున  కొత్త‌గా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 292 కేసులు, గుంటూరులో 237, కృష్ణాలో 210 కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ తో 235 మంది రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 911 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికి 31 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఎటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదు. 

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

కర్నూలు – 292

గుంటూరు – 237

కృష్ణా – 210

నెల్లూరు – 79

చిత్తూరు – 73

కడప – 58

ప్రకాశం – 56

పశ్చిమ గోదావరి – 54

అనంతపురం – 53

తూర్పు గోదావరి – 39

విశాఖపట్నం – 22

శ్రీకాకుళం – 4

విజయనగరం -0 

Leave a Comment