దేశంలో తగ్గిన కొత్త కేసులు..!

దేశంలో గడచిన 24 గంటల్లో 11,35,142 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 12,830 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 446 మంది కరోనా మరణించారు. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,58,186కి చేరింది. అయితే అంతకు ముందు రోజులో పోల్చితే తాజా కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. 

ఊరట ఇచ్చే అంశం ఏంటంటే.. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా 14,667 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3.36 కోట్లు దాటింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,59,272కి తగ్గి 247 రోజుల కనిష్టానికి చేరింది. కాగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందించిన మొత్తం డోసుల సంఖ్య 1.06 కోట్లు దాటింది. 

 

Leave a Comment