అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ సెటైర్లు..!

ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నయుడిపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. సభ ఆలస్యమైందని అచ్చెన్నాయుడు ప్రశ్నించగా.. గౌరవ అచ్చెన్న ధర్నా చేయడం వల్లే లేటైందని సీఎం జగన్ బదులిచ్చారు. అచ్చెన్నాయుడు ది గ్రేట్ అంటూ సీఎం జగన్ సెటైర్ వేశారు. 

తమను టీవీల్లో చూపించట్లేదని అచ్చెన్నాయుడు చెప్పగా.. ఆరడుగుల ఆజానుభాహుడు కనిపించకపోవడమేంటీ అని సీఎం జగన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ దాడుల గురించి చర్చ జరగాలని అచ్చెన్న కోరగా.. వైసీపీ ఎంపీ సురేష్ పై టీడీపీ చేసిన దాడిపైనేనా అని సీఎం జగన్ ప్రశ్నించారు. టీడీపీ నేతలు అసెంబ్లీకి ర్యాలీగా వచ్చి..అసెంబ్లీ వద్ద ధర్నా నిర్వహించారు. 

Leave a Comment