పెట్టుబడులే లక్ష్యం : సీఎం జగన్

ఎనర్జీ ఎక్స్ పోర్ట్ పాలసీ తయారీకి సీఎం ఆదేశం

అమరావతి : రాష్ట్రంలో ఎనర్జీ ఎక్స్ పోర్ట్ తయారు చేయాలని సీఎం జగణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం విద్యుత్‌ రంగంపై సీఎం సమీక్ష నిర్వహించారు. 

రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, ఆ విద్యుత్‌ను బయట అమ్మకోవాలనుకునే కంపెనీలకు, సంస్థలకు అనుకూలంగా పాలసీ తీసుకొస్తున్నామన్నారు. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్లాంట్లు పెట్టాలనుకునే వారికి సానుకూల వాతావరణం కల్పించేలా ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు. లీజు ప్రాతిపదికన పరిశ్రమలకు భూములిచ్చే ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. దీని వల్ల భూములిచ్చే వారికి మేలు జరుగుతుంది సీఎం తెలిపారు. దీని వల్ల ప్రతిఏటా రైతులకు ఆదాయం వస్తుందని, భూమిపై హక్కులు ఎప్పటికీ వారికే ఉంటాయని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో మరో 1000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనకు ఎన్టీపీసీ ముందుకు వస్తుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వీరికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 10వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణంపై కూడా సమావేశంలో చర్చించారు. వీలైనంత త్వరగా ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణం విధివిధానాలపై సమావేశంలో చర్చించారు. వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతర విద్యుత్‌ కోసం ఫీడర్ల ఆటోమేషన్‌ ఏర్పాటు పూర్తిచేయాలని, వచ్చే రెండేళ్లలోగా ఆటోమేషన్‌ పూర్తిచేయాలని ఆదేశించారు.

 

Leave a Comment