ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో రోడ్డు చాలా దారుణంగా ఉన్నాయి. అయితే రోడ్లు అంత అస్తవ్యస్తంగా ఉండటానికి గత ప్రభుత్వమే కారణం అంటూ జగన్ సర్కార్ నిందలు వేస్తోంది. దెబ్బతిన్న రోడ్డు మరమ్మతులు చేయాలని ప్రతిపక్ష పార్టీలు వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నాయి.
ఈక్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో రోడ్లపై సీఎం జగన్ ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి. జిల్లాలోని అనపర్తి కెనాల్ రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో ఈ రోడ్డును మరమ్మతులు చేయాలని గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త’ అంటూ గోతుల వద్ద ఫ్లెక్సీలు పెట్టారు.
అనపర్తి-బలభద్రపురం మధ్య సీఎం జగన్ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ‘ఈ బోర్డు రోడ్డు వేసే వరకు ఏవరైనా తొలగిస్తే వారి కుటుంబం ఈ రోడ్డుపైన పోతారు’.. అంటూ ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. గోతుల రోడ్డుపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
Don’t think anybody in the Country has received this honor.. hehe pic.twitter.com/x01PO6yzfs
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) December 12, 2021