సాయితేజకు కన్నీటీ వీడ్కోలు.. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు..!

తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సాయితేజ భౌేతికకాయాన్ని బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లా సరిమద్దు చీకలబైలు చెక్ పోస్ట్ వలసపల్లి మీదుగా ఎగువరేగడకు రోడ్డు మార్గంలో భారీ ర్యాలీగా తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు జాతీయ పతాకాలతో ర్యాలీ కొనసాగించారు. 

సాయితేజ భౌతికకాయాన్ని చూసి భార్య శ్యామల సొమ్మసిల్లి పడిపోయారు. ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సాయితేజ భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు బంధువులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయితేజ అమర్ రహే, జై జవాన్ అంటూ నినదించారు. అనంతరం సాయితేజ వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. సైనికులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు.  

   

Leave a Comment