పెళ్లినాటి చీరలో.. భర్తకు వీడ్కోలు పలికిన జవాన్ భార్య..!

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రయాణంలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దంపతులతో పాటు 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరణించిన లాన్స్ నాయక్ వివేక్ కుమార్ అంత్యక్రియలు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో జరిగాయి. సైనిక, ప్రభుత్వ లాంఛనాలతో శనివారం మధ్యాహ్నం జవాన్ కి అంత్యక్రియలు నిర్వహించారు.

అంత్యక్రియలకు వివేక్ కుమార్ భార్య ప్రియాంక పెళ్లి నాటి చీర కట్టుకొని హాజరయ్యారు. శ్మశాన వాటిక వద్ద ‘మేరా ఫౌజీ అమర్ రహే’ అంటూ నినదిస్తూ తన భర్తకు కన్నీళ్లతో వీడ్కోలు పలికారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని కలిచివేశాయి. తన భర్తను చూసి గర్వపడుతున్నట్లు వివేక్ భార్య ప్రియాంక చెప్పారు. తమ ఆరు నెలల బిడ్డ భవిష్యత్తు కోసం వివేక్ ఎన్నో కలలు కన్నాడని, వాటిని తాను నెరవేరుస్తానని తెలిపారు. అయితే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉపాధి కల్పించాలని వివేక్ తల్లి ప్రభుత్వాన్ని కోరారు.  

Leave a Comment