రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని, అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు’ అంటూ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 25, 2020
శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు..
తెలుగు ప్రజలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ దసరా పండుగ మీ కుటుంబానికి సకల శుభాలను చేకూర్చాలని, మీ ఇంట సిరి సంపదలతో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను. అరాచక శక్తుల స్వైరవిహారాన్ని ‘దుర్గామాత’ సహించదు. దాడులు-దౌర్జన్యాలకు పాల్పడితే అమ్మావారి ఆగ్రహం తప్పదు. శాంతి, సౌభ్రాత్రుత్వంతో అందరూ కలిసిమెలిసి జీవించాలన్నదే దసరా పండుగ సందేశం. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికార సమాజం కోసం కృషి చేద్దాం’ అంటూ చంద్రబాబు తెలిపారు.
దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ దసరా పండుగ మీ కుటుంబానికి సకల శుభాలను చేకూర్చాలని, మీ ఇంట సిరి సంపదలతో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను. (1/2) pic.twitter.com/2UFxVNWcg7
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) October 25, 2020