‘ఆర్టీవీ మిస్సింగ్’ ట్రైలర్ రిలీజ్..!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఒకరిని గిల్లనిదే నిద్రపట్టదేమో.. రాజకీయ నాయకుల నుంచి సినిమా స్టార్ల వరకు వారి జీవిత కథలను సినిమాగా తీసి వివాదాల పాలవుతుంటాడు. తాజాగా ‘ఆర్టీవీ మిస్సింగ్’ పేరుతో సినిమాను తీస్తున్నాడు. ఆ సినిమా ట్రైలర్ ను దసరా కానుకగా ఆదివారం విడుదల చేశాడు. 

ఈ ట్రైలర్ లో పలువురు టాలీవుడ్ స్టార్లు, పలువురు రాజకీయ ప్రముఖులను పోలీన నటులు ఉన్నారు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ ట్రైలర్ లో వర్మ మిస్సింగ్ అవుతాడు. అయితే ఆ కిడ్నాప్ ఎవరు చేశారా అని ఎన్వెస్టిగేట్ జరుగుతుంది. ఈ విచారణలో షాకింగ్ విషయాలు తెలుసుకుంటారు. అయితే వర్మ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారు. 

 

Leave a Comment