క్లాసులకు రావట్లేదని.. విద్యార్థిని కాలితో తన్నుతూ.. కర్రతో ఘోరంగా కొట్టాడు..!

తమిళనాడు చిదంబరంలోని బాలుర పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల దాష్టీకంగా ప్రవర్తించాడు. ఇష్టమొచ్చినట్లు విద్యార్థులను చితకబాదాడు. విద్యార్థి తప్పు చేస్తే నచ్చచెప్పాల్సిన ఆ ఉపాధ్యాయుడు అతడిని చావబాదాడు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

చిదంబంరంలోని ఓ బాలుర ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి తరగతులకు సరిగ్గా రావట్లేదని అతడిపై ఆ గురువు విరుచుకుపడ్డాడు. తరగతి గదిలో విద్యార్థుల ముందే కాలుతో తన్ని చితకబాదాడు. కాళ్లపై తొడలపై తన్నాడు. కర్రతో వెనుకవైపున కొట్టాడు. ఇదంతా క్లాస్ లో ఉన్న ఓ విద్యార్థి వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

 

Leave a Comment