తమిళనాడు చిదంబరంలోని బాలుర పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల దాష్టీకంగా ప్రవర్తించాడు. ఇష్టమొచ్చినట్లు విద్యార్థులను చితకబాదాడు. విద్యార్థి తప్పు చేస్తే నచ్చచెప్పాల్సిన ఆ ఉపాధ్యాయుడు అతడిని చావబాదాడు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిదంబంరంలోని ఓ బాలుర ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి తరగతులకు సరిగ్గా రావట్లేదని అతడిపై ఆ గురువు విరుచుకుపడ్డాడు. తరగతి గదిలో విద్యార్థుల ముందే కాలుతో తన్ని చితకబాదాడు. కాళ్లపై తొడలపై తన్నాడు. కర్రతో వెనుకవైపున కొట్టాడు. ఇదంతా క్లాస్ లో ఉన్న ఓ విద్యార్థి వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
WARNING GRAPHIC CONTENT |
Class 12 student thrashed by a government school teacher for not attending the classes.The incident is said to have occured in Chidambaram district in #TamilNadu. Strict action should be taken against the teacher
#school #Governmentschool #teacher pic.twitter.com/j26pBS74qj
— Subodh Kumar (@kumarsubodh_) October 14, 2021