అమెరికాలో చిత్తూరు మహిళ మృతి..!

అమెరికాలో చిత్తూరు జిల్లాకు చెందిన మహిళ మంగళవారం మృతి చెందింది. అయితే తమ అల్లుడు తమ అమ్మాయిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. 2016లో పూతలపట్టు మండలం బందార్లపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తె ప్రేమలత(32)కు, అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లెకు చెందిన సుధాకర్ నాయుడుతో పెళ్లి జరిగింది.

2017లో సుధాకర్ దంపతులు అమెరికా వెళ్లారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు గీతాంష్ ఉన్నాడు. అయితే మంగళవారం రాత్రి ప్రేమలత ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం రావడంతో వారు షాక్ కు గురయ్యారు. అయితే ప్రేమలత తండ్రీ, బంధువులు మాత్రం ఆమె చనిపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెను సుధాకర్ హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె మృతదేహాన్ని కూడా పంపించడ లేదని, ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని ప్రేమలత తల్లిదండ్రులు చిత్తూరు కలెక్టర్ భరత్ నారాయణ గుప్తాకు విజ్ఞప్తి చేశారు. 

Leave a Comment