హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో తెలుగు జవాన్..!

తమిళనాడులోని కన్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఆయనతో పాటు రావత్ భార్య మధులిక మరో 11 మంది ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన సాయితేజ్ కూడా ఉన్నారు. 

చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏడాది క్రితం వరకు బెంగళూరులోని సిపాయిల శిక్షణా కేంద్రంలో శిక్షకుడిగా పనిచేశారు. ఇటీవల ఆయన బిపిన్ రావత్ కి వ్యక్తిగత భద్రతా అధికారిగా ఉన్నారు. 

సాయితేజ్ కి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయం 8.45 గంటలకు సాయితేజ్ తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడారు. తర్వాత కొన్ని గంటల్లోనే హెలికాప్టర్ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సాయితేజ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

 

Leave a Comment