ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దుర్మరణం..!

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారు. తమిళనాడులోని కున్నూరు నీలగిరికొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది ఈ ప్రమాదంలో ఆయనతో సహా 13 మంది మృత్యువాతపడ్డారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిపిన్ రావత్ మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. మరణించిన వారిలో ఆయన సతీమణి మధులిక రావత్, ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. 

కాగా వెల్లింగ్టన్ లోని డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ప్రత్యేక విమానంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విమానంలో రావత్ దంపతులతో సహా 14 మంది ఉన్నారు. వీరిలో 13 మంది మరణించినట్లు వాయు సేన అధికారికంగా ధ్రువీకరించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ చికిత్స పొందుతున్నారు.   

Leave a Comment