హైవే ప్రాజెక్టుల్లో చైనా పెట్టుబడులను అనుమతించం : నితిన్ గడ్కరీ

జాయింట్ వెంటర్లతో సహా చైనా కంపెనీలను హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనేందుు అనుమతించమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రహదారి నిర్మాణానికి చైనా భాగస్వామ్యం కలిగి ఉన్న జాయింట్ వెంచర్లకు తాము అనుమతి ఇవ్వమని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలతో సహా పలు రంగాల్లో చైనా పెట్టుబడిదారులను కూడా అనుమతించే ప్రసక్తి లేదన్నారు. 

జాయింట్ వెంచర్ల ద్వారా చైనా కంపెనీలు మన దేశంలో ప్రవేశించే పరిస్థితి ఇక ఉండదన్నారు. త్వరలో హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనే చైనా సంస్థలపై నిషేధం విధించేలా ఓ పాలసీని తీసుకురాబోతున్నామన్నారు. అంతే కాక హైవే ప్రాజెక్టుల్లో భారత కంపెనీల అర్హత ప్రమాణాలు పెంపొందించేలా నిబంధనలు సడలింపు చేస్తామని వెల్లడిదంచారు.  

Leave a Comment