తమిళనాడులో కూలిన ఆర్మీ హెలీకాప్టర్.. చాపర్ లో బిపిన్ రావత్..!

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కానూరు వెల్లింగ్టన్ బేస్ లో ఆర్మీ హెలీకాప్టర్ కూలిపోయింది. ఈ హెలీకాప్టర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులిక, మరి కొందరు కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. హెలీకాప్టర్ లో మొత్తం 14 మంది ఉన్నట్లుతెలిసింది.

 సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీస్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన సహాయ సిబ్బంది ముగ్గురిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. మిగితా 11 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. హెలీకాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Leave a Comment