‘నన్ను చంపుతారా.. చంపండి’.. చంద్రబాబు ఫైర్..!

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై జరిగిన దాడిపట్ల చంద్రబాబు ఫైర్ అయ్యారు. దాడి జరిగిన వెంటనే పట్టాభి నివాసానికి చంద్రబాబు వచ్చిన ఆయనను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘చంపుతారా.. చంపండి చూస్తాం.. ఖబడ్దార్’ అంటూ హెచ్చరించారు. మీ ప్రాణం మీకు ఎంత ముఖ్యమో.. తమ ప్రాణం తమకు అంతే ముఖ్యమని, మీ బూతు మంత్రులు, రౌడీ ఎమ్మెల్యేలకు చెప్పాలని అన్నారు. 

ఇదే రిపీట్ అయితే జనం మిమ్మల్ని తరిమికొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో దాడి జరిగినప్పుడు పట్టాభికి భద్రత కల్పించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేేది కాదన్నారు. ‘నన్ను చంపుతారా.. చంపండి..ప్రజలు కన్నెర్ర చేస్తే మీరు బయటికి కూడా రాలేరని చంద్రబాబు తెలిపారు. 151 మంది ఎమ్మెల్యేలు కూడా జగన్ ని కాపాడలేరని అన్నారు.

జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వేధిస్తున్నారన్నారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యక్తుల్ని చూడలేదన్నారు. రౌడీలు, సంఘ విద్రోహశక్తులను సీఎం జగన్ తయారు చేస్తున్నారని విమర్శించారు. దాడులపై సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి నిలదీస్తామని చంద్రబాబు హెచ్చరించారు.    

Leave a Comment