‘దమ్ముంటే అక్కడ గెలువు చూద్దాం’.. జగన్ కు చంద్రబాబు సవాల్..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ కి సవాల్ విసిరారు.. దమ్ముంటే పులివెందులలో గెలువు చూద్దామని సవాల్ చేశారు. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. అధికార పార్టీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయడం, టీడీపీ ఫ్లెక్సీలను చించివేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంను హస్తగతం చేసుకుంటామని జగన్ చెబుతున్నారని, ముందుగా ఆయన పులవెందులలో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. వైసీపీ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. కుప్పం నుంచే ధర్మపోరాటానికి నాంది పలుకుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. 

Leave a Comment