టీడీపీ ముందు జగన్ ఒక బచ్చా : చంద్రబాబు

టీడీపీ ముందు జగన్ ఒక బచ్చా అని, వైసీపీ తాటాకుచప్పుళ్లకు భయపడేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు క్యాడర్ ని ఉద్దేశించి ప్రశంసించారు.  కర్నూలు మీటింగ్ చూస్తుంటే మహానాడును తలపించే విధంగా ఉందని తెలిపారు. 

టీడీపీని కాలగర్భంలో కలపాలి అనుకున్న వారు కనుమరుగయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరోనా కంటే ప్రమాదకరంగా జగన్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి జగన్ బాదుడే బాదుడు రీచ్ అయ్యిందని ఎద్దేవా చేశారు. తప్పుడు లెక్కలకు సీబీఐకి అడ్డంగా దొరికన జగన్ తనపై మాట్లాడుతాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజలకు వైసీపీ పాలనపై ప్రస్టేషన్ ఉందని చంద్రబాబు అన్నారు. టీడీపీ రాష్ట్రంలో ఇప్పుడు అందరికీ ఒక ఆశగా కనిపిస్తుందన్నారు. జగన్ తెచ్చిన మద్యం బ్రాండ్స్ దేశంలో మరెక్కడా లేవన్నారు. రాష్ట్రంలో 22 ఎంపీలు ఉన్నారని, జగన్ ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. మూడేళ్లలో ఒక్క రూపాయి పెట్టుబడి వచ్చిందా? ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు.  

కర్నూలును ఇండస్ట్రీ హబ్ చేయాలని కంపెనీలను తెచ్చామని, ఎయిర్ పోర్ట్ తామే తెచ్చామని చంద్రబాబు అన్నారు. గడప గడపలో నేతలను జనం ప్రశ్నిస్తుంటే…ఇప్పుడు వైసీపీ బస్సు యాత్ర అంటుందని, భవిష్యత్తులో ఒక గాలి యాత్ర చేస్తారేమో అని ఎద్దెవా చేశారు. 

 

Leave a Comment