బ్లేడ్ తో గర్భిణీకి ఆపరేషన్.. తల్లీబిడ్డ మృతి.. 8వ తరగతి డాక్టర్ నిర్వాకం..!

చికిత్స కోసం వచ్చిన గర్భిణీకి బ్లేడుతో ఆపరేషన్ చేశాడు 8వ తరగతి చదివిన ఓ నకిలీ వైద్యుడు.. దీంతో తల్లీబిడ్డ ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూనమ్ అనే గర్భిణీకి పురుటి నొప్పులు రావడంతో భర్త రాజారామ్  ఒక మంత్రసాని వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఆమె డీహ్ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సూచించింది. అక్కడ పూనమ్ పరిస్థితి విషమంగా ఉండటంతో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని నర్సు చెప్పింది.

దీంతో రాజేష్ సాహ్నీకి చెందిన మా శారద హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ అనుభవం లేని రాజేంద్ర శుక్లా పూనమ్ కు చికిత్స చేశాడు. రేజర్ బ్లేడ్ తో ఆపరేషన్ చేశాడు. దీంతో పూనమ్ కు తీవ్ర రక్తస్రావం అయింది. శిశువు కూడా పుట్టిన కొద్ది నిమిషాలకే మరణించింది. దీంతో పూనమ్ ను వెంటనే ఆమెను జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడ తెలిపారు. దీంతో ఆమెను లక్నోలోని కేజీఎంయూ ట్రౌమా సెంటర్ కు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది.    

రాజేశ్ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని రాజారామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజేశ్ సాహ్ని అనే వ్యక్తి మా శారద హాస్పిటల్ పేరుతో రిజిస్ట్రర్ చేయకుండా, మౌలిక సదుపాయాలు లేకుండా నిర్వహిస్తున్నాడు. అక్కడ పనిచేసే రాజేంద్ర శుక్లా కూడా 8వ తరగతి మాత్రమే చదివినట్లు తెలిసింది. దీంతో అనుభవం లేకుండా బ్లేడుతో ఆపరేషన్ చేసి ఇద్దరు ప్రాణాలను పొట్టనపెట్టుకున్న రాజేంద్ర శుక్లా, రాజేశ్ సాహ్నిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

Leave a Comment