అత్యాచారం చేయబోతే మర్మాంగాన్ని కోసిన మహిళ..!

ఇంట్లోకి చొరబడి తనపై అత్యాచారం చేయబోయిన వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది ఓ మహిళ. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల మేరకు జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమారియా గ్రామంలో 45 సంవత్సరాలు కలిగిన మహిళ 13 ఏళ్ల కొడుకుతో ఇంట్లో ఉంది.  గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి(45) ఇంట్లో ప్రవేశించాడు. 

ఇంట్లోకి దొంగ ప్రవేశించాడనే భయంతో ఆమె కొడుకు బయటకు పరుగులు తీశాడు. లోపలికి వచ్చిన వ్యక్తి మహిళను కింద పడేసి ఆమెపై అత్యాచారాని ప్రయత్నించాడు. దాదాపు 20 నిమిషాల పాటు ఆమె అతడి ప్రయత్నాన్ని ప్రతిఘటించింది. అయితే ఆ వ్యక్తి వదలకపోవడంతో తనను రక్షించుకోవడానికి మంచం కింద ఉన్న కొడవలి తీసుకొని అతని మర్మాంగాలను కోసేసింది. 

ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని ప్రథమ చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. తర్వాత అతడ్ని సిద్ధి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు అతడ్ని రేవా జిల్లాలోని సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. మహిాళ ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు కూడా మహిళపై ఫిర్యాదు చేశాడు. 

Leave a Comment