అమరావతే ఏపీ రాజధాని.. స్పష్టం చేసిన కేంద్రం..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం అమరావతే ఏపీ రాజధాని అని చెప్పింది. రాజ్యసభలో ప్రశ్నోత్తార సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీ రాజధానిపై ప్రశ్రించారు. ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధం నెలకొందని, మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న తర్వాత రాజధాని ఏదో తెలియడం లేదని పేర్కొన్నారు. ఏపీ రాజధాని ఏదని? దీనిపై ఎవరు నిర్ణయం తీసుకోవాలని జీవీఎల్ ప్రశ్నించారు. 

ఈ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇస్తూ.. రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే అని ప్రకటించారు. ఏపీ రాజధాని అమరావతి అని మొదట తమకు సమాచారం ఇచ్చారన్నారు. ఆ తర్వాత మూడు రాజధానులని, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి అని, పాలనా రాజధానిగా విశాఖపట్నం అని, జ్యుడీషియల్ కేపిటల్ గా కర్నూల్ అని చెప్పారన్నారు. ఆ బిల్లులను వెనక్కి తీసుకున్నట్లు తాము కూడా వార్తల ద్వారా తెలుసుకున్నామన్నారు. తమ దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని నిత్యనంద రాయ్ స్పష్టం చేశారు.   

 

Leave a Comment