CBN 420 నారావారిపల్లెలో పుట్టింది : కొడాలి నాని

కర్నూలులో కొత్త వేరియంట్ ఎన్ 440 కే వచ్చిందంటూ చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, కర్నూలులో కాదు చిత్తూరు జిల్లాలో ఈ వేరియంట్ పుట్టిందని మంత్రి కొడాలి నాని విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు సీబీఎన్ 420 అనే వేరియంట్ నారావారిపల్లెలో పుట్టిందని తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. 

చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని బహిరంగ సవాల్ విసిరారు. చంద్రబాబు బ్యాంకు అకౌంట్ నంబర్ చెబితే.. వ్యాక్సిన్ కోసం ఎంత డబ్బు అయినా ప్రభుత్వం ఇస్తుందని, ఆయనకు దమ్ముంటే టీకా తెప్పించాలని చాలెంజ్ చేశారు. రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 

ప్రభుత్వంపై జూమ్ యాప్ లో చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న చంద్రబాబుపై కేసు పెట్టాలని ఆయన సీఎం జగన్ ని కోరారు. కరోనా కట్టడిలో కేంద్రం, రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు.

కరోనా కన్నా భయంకరమైన లక్షణాలతో బయట నలుగురు కుట్ర చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. మొదటి వ్యక్తి చంద్రబాబు, రెండో వ్యక్తి ఈనాడు రామోజీ రావు, మూడు ఏబీఎన్ రాధాక్రిష్ణ, టీవీ 5 బీఎన్ నాయుడు అని తెలిపారు. వీరు కుల గజ్జితో అధికారంలో తామే ఉండాలని ఎంతకైనా దిగజారిపోతున్నారని విమర్శించారు. రెండు చెత్త పేపర్లు, నాలుగు డబ్బా చానల్స్ ఉన్నాయని, శ్మశానంలో కెమెరాలు పెట్టి ఫొటోలు, వీడియోలు తీయవచ్చన్న భ్రమలో ఈ నలుగురు బతుకుతున్నారని పేర్కొన్నారు. 

బాధ్యతలు మరిచి పిచ్చి వాగుడు వాగితే ఎవరిని కూడా వదిలిపెట్టమని కొడాలి నాని హెచ్చరించారు. దున్నపోతుకు ప్యాంట్ వేస్తే అది అచ్చెన్నాయుడు అని, లోకేష్ పెద్ద వెధవ అని అచ్చెన్నాయుడే చెప్పారని కొడాలి నాని అన్నారు. మీడియా కోసం పిచ్చి కుక్కల మొరుగితే ఎవర పట్టించుకుంటారన్నారు. పైల్స్ ఆపరేషన్ చేయిస్తేనే రెండు నెలలు ఆస్పత్రిలో ఉన్నారని, అచ్చెన్నాయుడికి ట్రిట్ మెంట్ సరిపోలేదదని, వెటర్నరీ ఆస్పత్రిలో చికిత్సలు అందించాలని అన్నారు. 

 

Leave a Comment