దారుణం.. కూల్ డ్రింక్ లో మద్యం కలిపి సోదరిపైనే అత్యాచారం..!

హైదరాబాద్ లో దారుణం జరగింది. వరుసకు సొదరి అయిన యువతిపై అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. అంతే కాకుండా వీడియో చిత్రీకరించిన డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఫిలింగనర్ లోని మహాత్మాగాంధీనగర్ లో ఓ యువతి నివాసం ఉంటుంది. 

ఆ యువతి ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ తీసుకుంటుంది. ఇటీవల కర్ణాటకలో నివాసం ఉండే తన తల్లి సోదరి కొడుకు నిఖిల్ హైదరాబాద్ కు వచ్చి టైలర్ గా పనిచేస్తున్నాడు. అతడు కూడా మహాత్మాగాంధీనగర్ లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఈక్రమంలో వరుసకు సోదరి అయిన యువతి వద్ద నిఖిల్ రూ.50 వేలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బును త్వరలో ఇచ్చేస్తానని చెప్పాడు. 

ఈనెల 2న డబ్బులు ఇస్తానని బాధిత యువతిని తన గదికి పిలిచాడు. ఆ యువతి వచ్చిన తర్వాత ఆమెకు మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించాడు. దీంతో ఆ యువతి నిద్రలోకి జారుకుంది. ఆ తర్వాత నిఖిల్ ఆమెపై అత్యాచారం చేశాడు. అంతే కాదు దానిని ఫోన్ లో చిత్రీకరించాడు. 

ఇక ఈనెల 4న బాధిత యువతి నిఖిల్ ని డబ్బులు ఇవ్వాలని నిలదీసింది. అందుకు నిఖిల్ నిరాకరించాడు. ఆమెపై అత్యాచారం చేసిన ఫొటోలను చూపించి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

 

Leave a Comment